|
|
భారత్ 69
మీర్పూరు: భారత్-బంగ్లాదేశ్ల మధ్య మీర్పూరు వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో మొదటి రోజు ఆటముగిసే సమయానికి భారత్ వికెట్లు కోల్పోకుండా 69 పరుగులు చేసింది. ఓపెనర్లు గంభీర్ 26(38), సెహ్వాగ్ 41(40) పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 233 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా జట్టును భారత్ బౌలర్లు ఆదిలోనే కట్టడి చేశారు. ఓపెనర్లు డకౌట్ కాగా మిగిలిన బ్యాట్స్మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. మహ్మదుల్లా 89(148) పరుగులతో బాధ్యతయుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. భారత్ బౌలర్లు ఇషాంత్శర్మ నాలుగు వికెట్లు తీయగా, జహీర్ మూడు, ఓజా రెండు వికెట్లు తీశారు.
|
|
|