|
|
మిర్పూర్ టెస్ట్లో భారత్ విజయం
మిర్పూర్: బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్ సిరీస్ను టీమ్ ఇండియా కైవసం చేసుకుంది. మిర్పూర్ వేదికగా జరిగిన రెండో టెస్ట్లో భారత్ పది వికెట్ల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. 2-0 తేడాతో బంగ్లాను క్లీన్ స్విప్ చేసిన ధోనీ సేన టెస్ట్ ర్యాంకింగ్లో అగ్ర స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
మూడు వికెట్ల నష్టానికి 228 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో బుధవారం నాలుగు రోజు ఆట కొనసాగించిన బంగ్లాపై టీమిండియా బౌలర్లు విరుచుకుపడ్డారు. భోజన విరామ సమయానికి 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసిన బంగ్లాదేశ్, పరుగులేమీ జోడించకుండానే చివరి వికెట్ సమర్పించుకుంది. పేసర్ జహీర్ఖాన్ ఒక ఓవర్లోనే నాలుగు వికెట్లు తీశాడు. తన కెరీర్లోనే అత్యుత్తమ గణాంకాలు (7/87) నమోదు చేశాడు.
రెండు పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ వికెట్లేమి కోల్పోకుండానే విజయం సాధించింది. ఈ పరుగులు కూడా బంగ్లా బౌలర్ల ఎక్స్ట్రాల రూపంలో ఇచ్చారు. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 233 పరుగులు చేయగా, భారత్ 544/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఈ టెస్ట్లో పది వికెట్లు తీసిన జహీర్ఖాన్కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.
|
|
|