|
|
ధోని చేజారిన వన్డే నెంబర్ వన్ ర్యాంక్
దుబాయ్: భారత క్రికెట్ సేనాధిపతి ధోని వన్డే నెంబర్ వన్ ర్యాంకును చేజార్చుకున్నాడు. నిలకడైన ఆటతీరుతో ఏడాది కాలంగా నెంబర్ వన్ కిరీటంతో రారాజుగా వెలుగొంతున్న ధోని తాజాగా ప్రకటించిన ఐసిసి వన్డే ర్యాంకింగ్స్లో రెండో ర్యాంకుకు పడిపోయాడు. ఆస్ట్రేలియా ఆటగాడు మైక్హస్సీ పాక్తో జరిగిన సిరీస్లో అద్భుత ఆటతీరును ప్రదర్శించడంతో పాయింట్లను మెరుగుపరుచుకుని నెంబర్ వన్ స్థానానికి ఎగబాకాడు. బంగ్లాదేశ్ సిరీస్లో రాణించిన సచిన్ టెండూల్కర్ 723 పాయింట్లతో ఏడో స్థానంలోనూ, మార్పేమీ లేకుండా 702 పాయింట్లతో తొమ్మిదో స్థానంలోనూ కొనసాగుతున్నారు. యువరాజ్ సింగ్ 12, గౌతం గంభీర్ 19, సురేష్రైనా 20వ ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. బంగ్లాదేశ్లో మెరుపులు మెరిపించిన విరాట్కోహ్లీ ఏకంగా 21వ స్థానానికి చేరుకున్నాడు.
|
|
|