|
|
12న 'కేడీ' విడుదల
నాగార్జున, మమతామోహన్దాస్ జంటగా కిరణ్ దర్శకత్వంలో కామాక్షి కళామూవీస్ పతాకంపై డి.శివప్రసాదరెడ్డి నిర్మిస్తున్న 'కేడి' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని, రీరికార్డింగ్ దశలో వుంది. ఈ చిత్రాన్ని మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 12న విడుదల చేయనున్నట్టు నిర్మాత శివప్రసాదరెడ్డి చెప్పారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఆడియోకు మంచి స్పందన వచ్చిందని, తమ బ్యానర్లో నాగార్జునతో తీసిన ఈ స్టైలిష్ కమర్షియల్ చిత్రం మరో సూపర్హిట్గా నిలుస్తుందని పేర్కొన్నారు.
అన్నపూర్ణా స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రంలో అమెరికాకు చెందిన నటి లిండా ముఖ్య పాత్రను పోషిస్తోంది. సందీప్చౌతా సంగీతాన్ని అందిస్తున్నారు.
|
|
|