|
|
ప్లే-ఆఫ్కు భారత్ క్వాలిఫై
కౌలాలంపూర్: ఫెడ్కప్ టెన్నిస్ టోర్నీలో భారత్ ప్లే-ఆఫ్కు అర్హత సాధించింది. ఇక్కడ జరుగుతున్న ఆసియా-ఓసియానియా గ్రూప్-2 విభాగంలో పూల్-ఏలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. శుక్రవారం మలేసియాతో జరిగిన రెండోరౌండ్ పోరులో భారత్ క్లీన్స్వీప్ సాధించింది. గత ఏడాది ఆసియా-ఓసియానియా గ్రూప్-2లోనే ఇంటిదారి పట్టిన భారత్ ఈసారి గ్రూప్-1కు కు క్వాలిఫై సాధించింది. తొలి సింగిల్స్లో పూజశ్రీ 6-1, 6-1 తేడాతో చిన్-బీ ఖోపై ఘన విజయం సాధించింది. ఇక రెండో సింగిల్స్ సానియా నెగ్గి, భారత్కు 2-0 ఆధిక్యం ఇచ్చింది. ఇక కీలకమైన డబుల్స్లో రుషిక-పూజశ్రీలు 7-6, 6-2 తేడాతో నోర్డిన్/చి-బీఖోపై గెలిచి క్లీన్స్వీప్ సాధించారు. తర్వాతి రౌండ్లో భారత్ కజికిస్థాన్-హాంకాంగ్ విజేతతో ఢీ కొంటుంది.
|
|
|