|
|
భారత్కు మరో 8 స్వర్ణాలు
ఢాకా: 11వ దక్షిణాసియా క్రీడల్లో భారత్ జోరు కొనసాగుతోంది. ఎనిమిదో రోజు 10 ఈవెంట్లకు పోటీలు జరగ్గా అందులో భారత్ ఎనిమిది స్వర్ణాలను సాధించింది. భారత్ 40 స్వర్ణాలు, 17 రజతాలు, 10 కాంస్యాలతో మొత్తం 67 పతకాలతో అగ్రస్థానంలో ఉంది. పాకిస్థాన్ 31 పతకాలు (6 స్వ, 16 ర, 9 కా)లతో రెండో స్థానంలో ఉంది. స్విమ్మింగ్లో భారత్ 4 స్వర్ణాలు సాధించింది. ఒలింపియన్ రెహన్ పొంచా 200 మీటర్ల వ్యక్తిగత మిడ్లేలో 2:12.06 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరి భారత్కు స్విమ్మింగ్లో తొలి బంగారు పతకం అందించాడు. ఇక మిగిలిన స్విమ్మర్లలో సందీప్సెజ్వాల్, సుభా చిత్రంజన్, అరోన్ డీ‘సౌజాలు స్వర్ణాలు సాధించారు. భారత షూటర్లు మరో నాలుగు బంగారు పతకాలు గెలిచారు. 50 మీటర్ల పీస్టల్లో ఓమ్ప్రకాష్ 679.2 పాయింట్లతో ఈ గేమ్స్లో నాలుగో స్వర్ణం తన ఖాతాలో వేసుకున్నాడు. ఐతే బాస్కెల్బాల్ ఫైనల్లో భారత్పై ఆఫ్ఘనిస్థాన్ నెగ్గి తొలిస్వర్ణాన్ని గెలుపొందింది. బాక్సింగ్లో నాలుగు విభాగాల్లో భారత బాక్సర్లు ఫైనల్కు అర్హత సాధించారు.
|
|
|