|
|
ఫిగో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం
చెన్నై: ఫోర్డ్ ఇండియా మరైమలై నగర్ ప్లాంట్లో ఫిగో కాంపాక్ట్ కారు వాణిజ్య ఉ త్పత్తిని ఆరంభించింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి ఈ కార్యక్రమాన్ని ఆరంభించారు. చిన్న కార్ల మార్కెట్లో పెద్ద వాటాను పొందేందుకు సంస్థ ప్రయత్నిస్తోంది. అదనంగా రూ. 1,500 కోట్లతో ఈ కేంద్రాన్ని విస్తరించేందుకు ఫోర్డ్ సంస్థ తమిళనాడు ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఫిగోకు అవసరమైన నూతన ఇంజిన్లను తయారు చేయడం ఇందులో భాగంగా ఉంటుంది. విస్తరణ అనంతరం కంపెనీ మరో 1000 మంది సిబ్బందిని నియమించనుంది.
|
|
|