|
|
'హైస్కూల్'కు గ్రీన్సిగ్నల్
టెన్త్క్లాస్ కుర్రాడు, టీచర్ మధ్య జరిగే ప్రేమకథగా భావించి తమ చిత్రంపై పలు విమర్శలు వచ్చాయని, ఈ చిత్రాన్ని సెన్సార్కు చెందిన ఎగ్జామింగ్కమిటీ, రివైజింగ్ కమిటీ చూడడంతో పాటు, ముంబయికు చెందిన ట్రిబ్యునల్ కమిటీ చూశాక 'హైస్కూల్' చిత్రాన్ని విడుదల చేయడానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చిందని చిత్ర దర్శకుడు నరసింహనంది అన్నారు. '1940లో ఒక గ్రామం' ద్వారా నంది అవార్డును, జాతీయస్థాయి అవార్డును పొందిన తనకు మంచి సినిమా తీయాలనేది తన బ్యాధతనీ, దాన్ని ఈ చిత్రం ద్వారా నెరవేర్చారనీ, ఇదే అభిప్రాయాన్ని ట్రిబ్యునల్ కమిటీ ఛైర్మన్ ఉషామెహ్రాకూడా వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఇప్పటి యువత ఏది మంచి, ఏదీ చెడూ అనేది తెలుసుకుని మెలగాలనేది తన చిత్రంలోని సందేశమని అన్నారు. చిత్ర నిర్మాత మల్లన్న మాట్లాడుతూ, నెగటివ్లో చెప్పకుండా పాజిటివ్గా చిత్రాన్ని చెప్పే ప్రయత్నం చేశామనీ, 'ఎ' సర్టిఫికెట్ పొందిందని చెప్పారు. ఈనెలాఖరులో సినిమాను విడుదల చేయనున్నామన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో గుండు హనుమంతరావు, కార్తీక్, సంగీతదర్శకుడు సాకేత్సాయిరామ్ కూడా పాల్గొన్నారు.
|
|
|