|
|
జైపూర్లో యన్.టి.ఆర్. 'శక్తి'
యన్.టి.ఆర్. హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న 'శక్తి' శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత అశ్వనీదత్ చిత్ర విశేషాలను తెలియజేస్తూ శనివారం రాజస్థాన్లోని జైపూర్లో 300 మంది యూనిట్ సభ్యులతో భారీ ఎత్తున షూటింగ్ జరుగుతుంది. 15 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్లో ఓ పాట, కొన్ని ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తాం అన్నారు. యన్.టి.ఆర్. మాట్లాడుతూ, 'ఈ కథలో చాలా పవర్ వుంది. నాకెరీర్లో ఈ చిత్రం మైలురాయిలా నిలుస్తుంది. అశ్వనీదత్ సంస్థలో మెహర్ రమేష్ దర్శకత్వంలో నటించడం ఆనందంగా వుంది అన్నారు. ఎన్టీఆర్, ఇలియానా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సత్యానంద్, కెమెరా: సమీర్రెడ్డి, సంగీతం: మణిశర్మ, రచనా సహకారం: యండమూరి వీరేంద్రనాథ్, జె.కె.భార్గవి, తోట ప్రసాద్, డి.ఎస్. కన్నన్, పాటలు: వేటూరి, సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, సమర్పణ: సి.ధర్మరాజు, నిర్మాత: సి.అశ్వనీదత్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: మెహర్ రమేష్.
|
|
|