|
|
విలేజ్మాల్స్ల ఏర్పాటుకు ప్రయత్నాలు
నిజామాబాద్: ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా అన్ని నిత్యావసర వస్తువులను విక్రయించేందుకుగానూ విలేజ్మాల్స్గా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ జగన్నాథం చెప్పారు. రేషన్డీలర్లు, హోల్సేల్ వ్యాపారులతో నిర్వహించిన సమావేశంలో జెసీ మాట్లాడారు. దశలవారీగా మండలస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఈ మాల్స్ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈవిషయంలో ఏవైనా సలహాలు, సూచనలు ఉంటే ఇవ్వాలని ఆయన కోరారు. బయట మార్కెట్ కంటే వస్తువులను తక్కువ ధరకే అందించాలని వీటిపై కొంతమేరకు కమీషన్ కూడా ఉంటుందని ఆయన వెల్లడించారు. దీంతోపాటు డీలర్లు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశ్యంతో అన్ని రకాల వస్తువులను విక్రయించాలని ప్రభుత్వం భావిస్తుందని జెసీ తెలిపారు. ఈ సమావేశంలో ఐడిసిఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి, టెలికాం డిప్యూటీ జనరల్ మేనేజర్ నాగేశ్వరరావు, ఆర్డీవో నర్సింగరావు, డిఎస్ఒ పాండు తదితరులు పాల్గొన్నారు.
|
|
|