|
|
నిరుపేదలకు భూమి పంపిణీ
కడప, ఫిబ్రవరి 9 (ఎపిఇఎంఎస్): బ్రహ్మంగారి మఠం మండలంలోని భూమి లేని నిరుపేదలకు ఒక్కొక్కరికి ఎకరం చొప్పున 500 మంది లబ్దిదారులకు ఏఫ్రిల్ నెలలో భూమిని పంపిణీ చేయనున్నట్లు మైదుకూరు ఎమ్మెల్యే డిఎల్ రవీంద్రరెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏఫ్రిల్ 14వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. మండలంలో భూమిలేని నిరుపేదలందరినీ గుర్తించేందుకు ఈనెల 11 నుంచి గ్రామాలలో రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలిస్తామన్నారు. మండలంలో ఇప్పటి వరకు పదకొండు వందలకు పైగా రేషన్ కార్డులను తొలగించారని అన్నారు. వీటిని పరిశీలించేందుకు త్వరలో గ్రామ సభలు నిర్వహిస్తామని అన్నారు. గ్రామ సభల ద్వారా రిజమైన లబ్దిదారులను గుర్తించి వారికి తిరిగి కార్డులను అందించే ఏర్పాటు చేస్తామన్నారు. లబ్దిదారులు వాస్తవ విషయాలను అధికారుల దృష్టికి తీసుకువెళితే న్యాయం జరుగుతుందని ఆయన వివరించారు.
|
|
|