|
|
హైదరాబాద్ ఏ ఒక్కరి సొత్తు కాదు
కడప: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఏ ఒక్కరి సొత్తు కాదని టిడిపి నాయకుడు డాక్టర్ జిఎం నాయుడు స్పష్టం చేశారు. రాజంపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్ర జేఏసీ విద్యార్థులు చేపట్టిన శాంతియుత పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడం సరైంది కాదన్నారు. అన్ని ప్రాంతాల ప్రజల పెట్టుబడులతోనే రాష్ట్ర రాజధాని అభివృద్ధిచెందిందని చెప్పారు. అందువల్ల రాజధాని ఏ ఒక్కరిదో అనుకుంటే పొరపాటేనని వివరించారు. సామాజిక అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిిలో వుంచుకుని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. కేంద్రమంత్రి చిదంబరం ఆంధ్ర రాష్ట్రంలో అలజడులు సృష్టించడం ద్వారా తమిళనాడు రాష్ట్రంలో అభివృద్ధి చెందేలా చాపకింద నీరులా వ్యవహరిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవడం చిదంబరానికి ఇష్టం లేదని ఆయన స్పష్టం చేశారు.
|
|
|