|
|
ఎంసెట్ రీజినల్ కోఆర్డినేటర్ ఎంపిక
కడప: యోగి వేమన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బి.జయరామిరెడ్డి ఎంసెట్ 2010 రీజినల్ కోఆర్డినేటర్గా నియమితులయ్యారు. ఆ మేరకు జవహర్ నెహ్రూ టెక్నాలజీకల్ యూనివర్సిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ యేడాది మే 30 జరగనున్న ఎంసెట్ పరీక్షల నిర్వహణా బాధ్యతలను ఆయన నిర్వహిస్తారు. కడపలో విద్యార్థుల సౌకర్యం కోసం సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో రీజినల్ కార్యాలయ సెంటర్ను ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా జయరామిరెడ్డి చెప్పారు.
|
|
|