|
|
రాబోయే 30 సంవత్సరాల వరకు బొగ్గునిల్వల కొరత లేదు
ఖమ్మం: రాబోయే 30 సంవత్సరాల వరకు సరిపడ బొగ్గు నిల్వలు ఉన్నాయని సింగరేణి ఎక్స్ఫ్లోరేషన్ వివాదం అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నదని ఆ విభాగం ఉన్నతాధికారి బాబురావు అన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో గోదావరి పరివాహక ప్రాంతంలో 17 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. సింగరేణి వ్యాప్తంగా ఎక్స్ఫ్లోరేషన్ విభాగంలో 80 మంది శాస్త్రవేత్తలు, 392 మంది సిబ్బంది 25 డ్రిల్లింగ్ యాత్రాలు పని చేస్తున్నాయని అన్నారు. భూగర్భంలో బొగ్గు నిక్షేపాలను గుర్తించేందుకు డ్రిల్లింగ్ రాతి పొరల ఆధారంగా ఏఏ గ్రేడ్ల బొగ్గు ఎక్కడెక్కడ ఉందో నిర్థారిస్తామన్నారు. ఇప్పటి వరకు భూగర్భ గనుల్లో ఓపెన్కాస్ట్ గనుల్లో తవ్వగా మిగిలిపోయిన బొగ్గుగనులు లాగ్వాల్, హైవాల్ ప్రాజెక్టుల ద్వారా, పంచ్ ఎంట్రీ విధానం ద్వారా బొగ్గులు వెలికి తీసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొత్తగూడెం రీజియన్లోని గుండాల2, గుండాల 4 బ్లాక్ల అన్వేషణ పూర్తయిందని ఇక్కడ 250 నుంచి 500 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు.
|
|
|