|
|
ఊరిస్తున్న మిర్చీధర
ఖమ్మం: అనావృష్టితో కుదేలైన అన్నదాత రైతన్నను ఎర్రబంగారం మిర్చీ ధర కొంత ఊరటను కలిగిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఆరు వేల రూపాయలకు పైగా ధర పలుకుతోంది. గత మూడు సంవత్సరాల కాలం నుంచి మిర్చీధర రైతులను ఊరట పరుస్తోంది. జిల్లాల్లో రైతాంగం గణనీయంగా మిర్చీ కోస్తున్నారు. ధర ఆశాజనకంగా ఉండడంతో కొద్దిగా పండినా కూడా కాయను చెట్టుపై ఉంచడం లేదు. గతంలో రెండు లేదా మూడు క్వింటాలు కోతకు వస్తే గానీ కోసేవారు కాదు. ప్రస్తుతం క్వింటా వచ్చినా కూడా ఆగడం లేదు. మార్కెట్లోకి కొత్తమిర్చీ పోటెత్తితే ధర తగ్గుతుందనే భయంతో రైతులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఈ ఏడాది మిర్చీ ధర 10వ వేల రూపాయల వరకు వెళుతుందని రైతులు ఆశా జనకంగా ఉన్నారు. ధర ఊరిస్తుంటే తెగుళ్ళు రైతులను వణికిస్తున్నాయి. ఈ ఏడాది తలమాడు ప్రభావం అధికంగా ఉంది. ఇది మరీ ఎక్కువైతే దిగుబడులు అధికంగా తగ్గిపోతాయి. తెగుళ్ళ నుంచి కాపాడుకునేందుకు రైతులు వివిధ రకాల మందులను మిర్చీతోటపై పిచికారి చేస్తున్నారు.
|
|
|