|
|
వర్మ 3డి హారర్ ఫిల్మ్ 'వార్నింగ్'
అమితాబ్ బచ్చన్తో మీడియా డ్రామా 'రణ్'ని రూపొందించిన రామ్గోపాల్ వర్మ తొలిసారి ఒక 3డి సినిమాని రూపొందించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. హారర్ కథాంశంతో రూపొందే ఈ సినిమా పేరు 'వార్నింగ్'. అంతర్జాతీయ మార్కెట్లో 3డి సినిమాలకి మంచి గిరాకీ ఉందనీ, తాను తీసే 'వార్నింగ్' సినిమాకి సంబంధించిన స్క్రిప్టు ఇంకా ఆరంభ దశలోనే ఉన్నందున ఆ సినిమాలో ఎవరు నటించేదీ ఇప్పుడే చెప్పలేననీ వర్మ తెలిపారు. ఇప్పటికే ఆయన 'భూత్, డర్నా మనా హై, డర్నా జరూరీ హై, ఫూంక్' వంటి హారర్ సినిమాల్ని నిర్మించారు. ప్రస్తుతం 'ఫూంక్-2' (తెలుగులో 'ఆవహం')ని మిళింద్ గడాగ్కర్ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. కాగా 'వార్నింగ్' సినిమా తొలి భారతీయ 3డి హారర్ సినిమాకానున్నది.
|
|
|