|
|
క్రీడల ప్రాముఖ్యతను గుర్తించాలి
నిజామాబాద్: విద్యార్థులు క్రీడల ప్రాముఖ్యాన్ని కూడా గుర్తించి అందుకు అనుగుణంగా క్రీడలకు సమయాన్ని కేటాయించాలని జిల్లా విద్యాశాఖాధికారి సత్యనారాయణరెడ్డి సూచించారు. నగరంలోని ప్రైవేటు పాఠశాలలో జరిగిన తెలంగాణా స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు పరిపూర్ణంమైన వ్యక్తులుగా ఎదిగేందుకు క్రీడలు దోహదపడుతాయని ఆయన అన్నారు. క్రీడల వల్ల శారీరక, మానసిక వికాసం జరుగుతుందని ముఖ్యంగా విద్యార్థుల్లో ఏకాగ్రత అలవాటవుతుందని ఆయన చెప్పారు. విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా చదివితే విజయం సాధించవచ్చునని ఆయన అన్నారు. జిల్లా గత రెండు సంవత్సరాలుగా పదవ తరగతి పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిస్తుందని, మూడవ సారి కూడా పదవ తరగతిలో ప్రథమ స్థానంలో నిలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
|
|
|