|
|
వైద్యాధికారి వంచించాడని నాగమణి పోలీసులకు ఫిర్యాదు
విజయవాడ: చందర్లపాడు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి తనను వంచించినట్టు ఆశావర్కర్ నాగమణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నర్సు ఉద్యోగాన్ని ఇప్పిస్తానని మభ్యపెట్టి తన వద్ద 60వేల రూపాయలు తీసుకోవడంతో పాటు తనను శారీరకంగా కూడా లొంగతీసుకున్నాడని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఇది జరిగి 6నెలలైందని ఇప్పటి వరకు ఉద్యోగం ఇప్పిస్తాడన్న ఆశతో తాను మౌనం దాల్చానని ఆయన బదిలీపై వెళ్లిపోతున్నందున న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తున్నట్లు ఆమె తెలిపింది. కంచికచర్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా తనను నాగమణి బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు డాక్టర్ శ్రీధర్కూడా కౌంటర్ కేసు పెట్టారు. దీని మీద పోలీసులు కేసు నమోదు చేసి విచారణచేపట్టారు.
|
|
|